AAP Campaign: ‘ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)’ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. డీడీయూ మార్గ్లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో.. పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రచారాన్ని ప్రారంభించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలంతా తన కుటుంబ సభ్యులనీ, అందరం ప్రజాసేవకు అంకింతమై పని చేస్తున్నామని చెప్పారు. పార్లమెంటులో బలపడటం ద్వారా ఢిల్లీ ప్రజల అభ్యుదయానికి మరింత పాటుపడగలమని, అందుకోసం పట్టుదలగా పనిచేయాలని కార్యకర్తలకు కేజ్రీవాల్ దిశానిర్దేశం చేశారు.
కాగా, ఇండియా (INDIA) కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన ఆప్ ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, హర్యానాలో కాంగ్రెస్తో పొత్తులు ఖరారు చేసుకుంది. పొత్తులో భాగంగా ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో 4 స్థానాల్లో ఆప్, 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పొత్తుతో గుజరాత్లోని బరూచ్, జామ్నగర్, హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ఆప్ పోటీ చేస్తోంది.
అయితే పంజాబ్లో ఆప్ ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తోంది. అసోంలోని గువాహటి, డిబ్రూగఢ్, సోనిపట్ లోక్సభ నియోజకవర్గాలకు కూడా ఆప్ తమ అభ్యర్థులను ప్రకటించింది. 18వ లోక్సభకు ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. 17వ లోక్సభ గడవు మే నెలాఖరుతో ముగియనుంది.