శ్రీనగర్: ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం చేస్తున్న ఇరాన్కు కశ్మీరీలు చేతనైనంత విరాళాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. కశ్మీరీల దయను ఎన్నటికీ మరువమన్నది. ఆదివారం ప్రారంభమైన విరాళాల సేకరణ సోమవారమూ కొనసాగింది.
షియా ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు తాము దాచుకొన్న మొత్తాన్ని, బంగారాన్ని, వస్తువులను స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. తమ దేశానికి సాయం అందించాలని ఒక వారం క్రితం భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చింది.