శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు తహసీల్దార్ కార్యాలయంలోని చొరబడి కశ్మీర్ పండిట్ ఉద్యోగిని కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం కార్యాలయంలో ఒక్కసారిగా తుపాకీ కాల్పులతో ఉద్యోగుల మధ్య తోపులాట చోటు చేసుకున్నది. ఆ తర్వాత పలువురు ఉద్యోగులు రాహుల్ భట్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో రాహుల్ భట్ను శ్రీనగర్కు రెఫర్ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఉగ్రదాడి ఘటన తెలుసుకున్న భద్రతా బలగాలు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి. ఇదిలా ఉండగా.. ఈ నెల 7న శ్రీనగర్లో ఉగ్రవాదులు ఓ పోలీస్ను హతమార్చారు. పోలీస్ కంట్రోల్ హెల్ప్లైన్ 112లో డ్రైవర్గా నియమించారు. మరో శనివారం ఉదయం ఘటనలో బైక్పై వెళ్తున్న కానిస్టేబుల్ గులాం హసన్ను సఫాకదల్ ప్రాంతంలోని ఐవా వంతెన సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరుపడంతో మృతి చెందాడు.