న్యూఢిల్లీ : చైనీస్ వీసా కేసులో ముందస్తు బెయిల్ కోసం కార్తీ చిదంబరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 263 మంది చైనా పౌరులకు వీసాలు ఇప్పిచేందుకు పంజాబ్కు చెందిన ఓ సంస్థ ద్వారా రూ.50లక్షలు కార్తీ చిదంబరం తీసుకున్నట్లుగా ఈడీ ఆరోపించింది. దీనిపై ఇటీవల కేసు నమోదు చేసిన ఈడీ.. పలు చోట్ల తనిఖీలు నిర్వహించింది. అయితే, కేంద్ర ఏజెన్సీలు అసలు లక్ష్యం తన తండ్రేనని కార్తీ చిదంబరం ఆరోపించారు.
కార్తీ పిటిషన్పై విచారించగా.. బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకించింది. బెయిల్ మంజూరైతే ఆ డబ్బు ఎక్కడికి పోయిందో కనుగొనలేమని ఈడీ చెప్పింది. పంజాబ్లోని సెంట్రల్ బ్యూరోలో పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్న వేదాంత గ్రూప్ కంపెనీ తల్వాండి సాబో పవర్ లిమిటెడ్ (టీఎస్పీఎల్) టాప్ ఎగ్జిక్యూటివ్ నుంచి కార్తీ చిదరంబరం.. అతని సన్నిహితుడు ఎస్ భాస్కర రామన్ ద్వారా రూ.50 లక్షలు లంచంగా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, కార్తీ చిదంబరం ఈ ఆరోపణలను ఖండించారు. ఇవి వేధింపులేనని ఆరోపించారు.