న్యూఢిల్లీ, డిసెంబర్ 19: కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్ గోగమెడి హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం అప్పగించింది. సుఖ్దేవ్ హత్యలో ప్రముఖ గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉన్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు కోసం కేసును ఎన్ఐఏకి అప్పగించినట్టు తెలుస్తున్నది.
రాజస్థాన్లోని జైపూర్లో తన నివాసంలో కర్ణిసేన చీఫ్ను ఈ నెల 5న ముగ్గురు ఆగంతకులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. కర్ణిసేన చీఫ్ హత్యకు తానే బాధ్యుడినని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉన్న గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా ప్రకటించుకున్నారు.