ఓ వర్గాన్ని ఉద్దేశించి, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పెద్ద వివాదానికి దారి తీసింది. హుబ్లీ ధార్వాడ్లోని ఓ వ్యక్తి ఓ వర్గాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వివాదాస్పద పోస్ట్ చేసిన సదురు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా ఓ వర్గం శాంతించలేదు. ధార్వాడ్లోని హుబ్లీ పోలీస్ స్టేషన్పై రాత్రి సమయంలో దాడికి దిగారు.
అంతేకాకుండా పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేయాలని చూశారని అధికారులు పేర్కొంటున్నారు. నిరసనకారులు చేసిన దాడిలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. టియర్గ్యాస్, షెల్స్ను కూడా వాడి, నిరసనకారులను చెదరగొట్టారు. ఇక.. ఈ ఘటనకు బాధ్యులైన 40 మందిని ధార్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు.