Karnataka | హసన్, ఏప్రిల్ 11: కర్ణాటకలోని హసన్కు చెందిన కవలలకు పీయూసీ (12వ తరగతి) వార్షిక పరీక్షల్లో ఒకే మార్కులు(571/600) వచ్చాయి. గతంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇద్దరికీ ఇలాగే ఒకే మార్కులు (620/625) రావడం గమనార్హం. తాజా ఫలితాలపై కవలలిద్దరూ సంతో షం వ్యక్తం చేశారు. కవలల్లో రెండు నిమిషాలు పెద్దదైన చుక్కి స్పం దిస్తూ..‘ఇది పూర్తిగా యాదృచ్ఛికం.
ఇలా ఇద్దరికీ ఒకే మార్కులు ఎలా వచ్చాయో మాకే తెలియడం లేదు’ అని తెలిపారు. తాము 97 శాతం మార్కులు వస్తాయని ఆశించామని.. అయితే అంతకంటే కొంచెం తక్కువ వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం తాము నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నామని తెలిపారు. తామిద్దరం ఎప్పుడూ ఒకరితో ఒకరు పోటీ పడమని చుక్కి చెల్లెలు ఇబ్బని తెలిపింది.