ముస్లింలే లక్ష్యంగా బీజేపీ నేతల ప్రకటనలు
ఎన్నికల నేపథ్యంలో మళ్లీ హిందూత్వ ఎజెండా
బీజేపీ పాలిత కర్ణాటక మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారుతున్నది. అధికార పార్టీ నేతలు, రైట్ వింగ్ కార్యకర్తలు ముస్లింలే లక్ష్యంగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. వచ్చే ఏడాది మేలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ హిందూత్వ ఎజెండాను మళ్లీ తెరపైకి తెచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హిజాబ్పై నిషేధం
ఎప్పుడు మొదలైంది: జనవరి 27
వివాదమేంటి?: హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను ఉడుపిలోని ఓ కళాశాల యాజమాన్యం అడ్డుకొన్నది. ఇది తీవ్ర వివాదంగా మారి రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలకు దారితీసింది.
ముస్లిం వ్యాపారులకు నో
ఎప్పుడు మొదలైంది: మార్చి 24
వివాదమేంటి?: హిందూ ఆలయ పరిసరాల్లో వ్యాపారం చేయడానికి ముస్లిం సహా హిందూయేతర ఏ మతస్తులకు అనుమతి లేదని రైట్ వింగ్ కార్యకర్తలు కొందరు ముస్లింలను అడ్డుకొన్నారు. దీన్ని కర్ణాటక సర్కారు సమర్థించింది.
హలాల్ మాంసం కొనొద్దు
ఎప్పుడు మొదలైంది: మార్చి 30
వివాదమేంటి?: ‘హలాల్ మాంసం ఆరోగ్యానికి హా నికరం’ అంటూ రైట్ వింగ్ కార్యకర్తలు పోస్టర్లు అం టించారు. ‘హలాల్ ఆర్థికపరమైన మతయుద్ధం’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి అభివర్ణించారు.
పండ్ల వ్యాపారులపై నిషేధం
ఎప్పుడు మొదలైంది?: ఏప్రిల్ 6
వివాదమేంటి?: ముస్లిం వ్యాపారుల నుంచి పండ్లు కొనడాన్ని బహిష్కరించాలంటూ హిందూత్వ సంస్థ లు పిలుపునిచ్చాయి. కష్టపడేది హిందూ రైతులు అయితే, మధ్యలో ముస్లిం వ్యాపారులు లబ్ధి పొందుతున్నారని ఆరోపించాయి.
లౌడ్స్పీకర్ల పై నిషేధం
ఎప్పుడు మొదలైంది: ఏప్రిల్ 4
వివాదమేంటి?:మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలంటూ బజరంగ్దళ్, శ్రీరామసేన డిమాం డ్ చేశాయి. ధ్వని కాలు ష్యం సాకుతో బెంగళూరులోని పలు మసీదుల్లోని మైకుల్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
ముస్లిం కార్లలో ప్రయాణించొద్దు
ఎప్పుడు మొదలైంది: ఏప్రిల్ 8
వివాదమేంటి?: ముస్లిం లు డ్రైవర్లు, ఓనర్లుగా ఉన్న కార్లు, వాహనాల్లో హిందువులు ఆలయాలను సందర్శించవద్దని భారతీయ రక్షణ వేదిక పిలుపునిచ్చింది. హిందువులు నడిపే వాహనాల్లోనే ప్రయాణించాలని సూచించింది.