బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతున్నది. రోజువారీ కేసుల నమోదు 50 వేలు దాటింది. గురువారం రికార్డుస్థాయిలో 50,112 కరోనా కేసులు, 346 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,41,046కు, మొత్తం మరణాల సంఖ్య 16,884కు పెరిగింది. ఒక్క బెంగళూరు అర్బన్ ప్రాంతంలోనే గత 24 గంటల్లో 23,106 కరోనా కేసులు, 161 మరణాలు నమోదయ్యాయి.
మరోవైపు గురువారం 26,841 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 12,36,854కు చేరిందని, ప్రస్తుతం 4,87,288 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.