బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. రోజువారీ కేసుల నమోదు 45 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 47,754 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగళూరులోనే కరోనా కేసులు 30 వేలు దాటాయి. 30,540 మందికి పాజిటిగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,93,231కి చేరింది.
బెంగళూరులోనే రెండు లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 18.48 శాతంగా ఉందన్నారు. మరోవైపు గత 24 గంటల్లో 22,143 మంది కరోనా రోగులు కోలుకున్నారు. కాగా, 29 మంది కరోనా వల్ల చనిపోయారు. బెంగళూరులో 8 మంది వైరల్ వల్ల చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.