గాంధీ పరివారం వల్లే కాంగ్రెస్ ఏకతాటిపై నడుస్తుందని కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. గాంధీ పరివారం లేకుంటే కష్టమేనన్నారు. గాంధీ కుటుంబం లేకుంటే కాంగ్రెస్కు మనుగడే ఉండదని వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఫలితాల నేపథ్యంలో డీకే శివకుమార్ ఓ జాతీయ ఛానెల్లో మాట్లాడారు.
యూపీలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ చాలా కష్టపడ్డారని, కార్యకర్తలు కూడా శ్రమటోర్చారని, అయినా ఫలితాలను రాబట్టలేకపోయామన్నారు. ప్రజలను మెప్పించడంలో కాంగ్రెస్ నేతలంతా విఫలమయ్యామని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మెప్పించడానికి తమకు ఓ అవకాశం వచ్చిందని, ఇందులో తాము విఫలమయ్యామని డీకే పేర్కొన్నారు.