బెంగళూరు: ‘మేం ఎమ్మెల్యేలం.. ప్రతి మ్యాచ్కూ, ప్రతి ఎమ్మెల్యేకూ కనీసం ఐదు ఐపీఎల్ టికెట్లు ఉచితంగా ఇవ్వాల్సిందే. ప్రజాప్రతినిధులంటే వీఐపీలు. మేం లైన్లలో నిలబడం’ అంటూ కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశప్పనవర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ప్రభుత్వం నుంచి అనేక సౌకర్యాలు పొందుతూ కూడా ఎమ్మెల్యేలను గౌరవించడంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) వైఫల్యం చెందిందని ఆరోపించారు. ‘కర్ణాటకలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు కేఎస్సీఏ ఉచిత టికెట్లు ఇవ్వాల్సిందే’ అని అన్నారు. ఆయనకు విపక్ష సభ్యులు సైతం మద్దతు తెలిపారు.