Karnataka | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్(నమస్తే తెలంగాణ): ‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట్టే ఉన్నది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ఓటేసి గెలిపించిన రైతన్నలను అవమానించేలా ప్రవర్తిస్తున్నది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి శివానంద్ పాటిల్ తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. సాధారణంగా లేదా వేర్వేరు కారణాలతో జరిగిన రైతుల మరణాలను కూడా ఆత్మహత్యలుగానే చిత్రీకరిస్తూ కొందరు రైతు నేతలు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని శివానంద్ ఆరోపించారు.
ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రభుత్వం నుంచి అందడమే దీనికి కారణమని చెప్పుకొచ్చిన ఆయన.. ఎక్కువ మొత్తంలో పరిహారాన్ని రాబట్టడానికే రైతు నేతలు ఇలా చేస్తున్నట్టు వెల్లడించారు. రైతన్నల మరణాలపై తప్పుడు వ్యాఖ్యానాలు చేయొద్దని మంత్రిని హెచ్చరించిన రైతులు, వీలైతే, రైతుల ఆత్మహత్యలను కట్టడి చేయాలని హితవు పలికారు.