బెంగళూరు: మహిళలు, చిన్నారులను అక్రమ రవాణా చేసి సెక్స్వర్కర్లుగా మారుస్తుంటాడనే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న సాంట్రో రవి.. ముగ్గురు కర్ణాటక బీజేపీ మంత్రులతో దిగిన ఫొటోలు బయటకు రావడంతో దుమారం రేగింది. మంత్రులు అరగ జ్ఞానేంద్ర, కే సుధాకర్, బీసీ నగేశ్తో సాంట్రో రవి ఫొటోలు బయటకొచ్చాయి.
వీటితో పాటు ఓ పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్ కోసం సాంట్రో రవితో డీల్ మాట్లాడుతున్న రెండు ఆడియో క్లిప్లు వైరల్ అయ్యాయి. ‘సీఎం కూడా నన్ను సార్ అని పిలుస్తారు. వచ్చి గెస్ట్హౌజ్లో కలువు’ అంటూ డీఎస్పీతో రవి మాట్లాడినట్లుగా ఒక ఆడియో ఉంది. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించాలని జేడీఎస్ డిమాండ్ చేసింది.