న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరుతోపాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆంక్షలను కఠినతరం చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆయా ప్రాంతాల్లో జర్మన్ మోడల్ను అనుకరిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటన చేసింది. జర్మన్ మోడల్ అంటే టీకాలు వేసుకోని వారిపై బహరింగ ప్రదేశాల్లోకి రాకుండా నిషేధం ఉంటుంది. ఇవాళ్టి నుంచి బెంగళూరులో కూడా వ్యాక్సిన్ రెండు డోస్లు తీసుకోని వారిని బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా అడ్డుకుంటారు.
జర్మనీతోపాటు పలు ఇతరదేశాలు కూడా ఈ మోడల్ను అమలు చేశాయని కర్ణాటక ఉన్నతవిద్య, సమాచార సాంకేతిక, బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్వత్ నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏ దేశం కూడా ఈ మోడల్ అమలు అనేది తప్పనిసరి చేయలేదు. కానీ, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల వంటి బహిరంగ ప్రదేశాల్లో వ్యాక్సిన్ వేసుకోని వారు రాకుండా పరిమితులు విధించాయి.
కరోనా మహమ్మారి న్యూ వేరియంట్ ఒమిక్రాన్ దేశంలోనే తొలిసారిగా బెంగళూరులో బయటపడింది. బెంగళూరులో ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది.