Karnataka | బెంగళూరు, సెప్టెంబర్ 8: కర్ణాటకలో విధులు నిర్వర్తించే బ్యాంకు ఉద్యోగులు ఇకపై కన్నడలోనే మాట్లాడాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభు త్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయవచ్చని కన్నడ డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి సంతోశ్ హంగల్ తెలిపారు.
కర్ణాటక వాసులు ఎన్నో ఏండ్లుగా ఈ డిమాండ్ చేస్తున్నారు. ఇతర భాషల్లో బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతుండటంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.