Kumaraswamy | భారతీయ జనతా పార్టీలో జనతాదళ్ సెక్యులర్ (JDU) విలీనంపై వాస్తున్న వార్తలపై ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పందించారు. అంతా సవ్యంగా సాగితే బీజేపీలో జేడీయూ విలీనమయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదని.. ఇద్దరం కలిసి పని చేస్తామన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మా పార్టీ వేరే పార్టీలో విలీనం చేసే ప్రశ్నే లేదు. నేను చెబున్నట్లుగా బీజేపీ మంచిగా వ్యవహరిస్తే.. అంతా సవ్యంగా జరిగితే జేడీఎస్ బీజేపీలో చేరే ప్రశ్నే లేదు. కలిసి పనిచేస్తాం. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. ఇంకా వంద మంది సిద్ధరామయ్యలు తిరగబడినా మా పార్టీని ఏం చేయలేరని చెప్పాలనుకుంటున్నా’నన్నారు.
ప్రధాని మోదీ, దేవెగౌడ మధ్య సంబంధాలపై ఆయన స్పందిస్తూ.. ప్రధాని మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో దేవెగౌడ సైతం విమర్శించారని.. అయినా మోదీ ప్రధాని అయ్యాక దేవెగౌడ సైతం ఆయనను కలిశారన్నారు. కాంగ్రెస్ను ఓడించే సత్తా మా పార్టీకి ఉందని, నేను కాంగ్రెస్కు పూర్తిగా వ్యతిరేకినన్నారు. వారు మనతో ఎలా వ్యవహరిస్తారో, ముఖ్యమంత్రిగా నన్ను ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పేరులో సెక్యులర్ అనే పదాన్ని తొలగించారని కుమారస్వామి విమర్శించారు. లౌకికవాదం అంటే ఏంటో కాంగ్రెస్ని అడగాలనుకుంటున్నానన్నారు.
లౌకికవాదానికి, మతతత్వానికి అర్థం లేదని ఆయన అన్నారు. డీఎంకే కాంగ్రెస్, బీజేపీ రెండింటితో చేతులు కలిపిందని కుమారస్వామి ఆరోపించారు. ఇదిలా ఉండగా.. లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, అందరి దృష్టి మాండ్య స్థానం నెలకొన్నది. ఇక్కడి నుంచి గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సుమలత అంబరీష్ ఇటీవల బీజేపీలో చేరారు. ఆమెకు మాండ్య టికెట్ను బీజేపీ కేటాయించింది. అయితే, ఇంత వరకు కుమారస్వామి ఆమెకు మద్దతుగా ప్రచారం చేయడం లేదు. మరో వైపు సుమలత మైసూర్ అభ్యర్థి, మైసూర్ మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడియార్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.