COVID Guidelines | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొవిడ్ గైడ్లైన్స్ (COVID Guidelines) జారీ చేసింది.
కొవిడ్ పాజిటివ్ తేలితే తప్పనిసరిగా ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది (Home Isolation Mandatory). ఇక బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పకుండా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలు ఉన్న పిల్లల్ని పాఠశాలలకు పంపకుండా ఇంట్లోనే ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. వృద్ధులు, పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. మరోవైపు 30,000 డోసుల కరోనా వ్యాక్సిన్ను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కర్ణాటక కోరింది.
Also Read..
Ayodhya Ram Temple | అయోధ్య రామాలయం నిర్మాణానికి యాచకుల భారీ విరాళం
Mamata Banerjee | అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు టీఎంసీ డుమ్మా..!
Rahul Gandhi | భారత రెజ్లర్లకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ