బెంగళూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఒక ప్రధానోపాధ్యాయుడ్ని విద్యార్థినులు కర్రలతో చితకబాదారు. ఒక విద్యార్థిని పట్ల అతడు అసభ్యకరంగా ప్రవర్తించినందుకు వారంతా కలిసి గుణపాఠం చెప్పారు. కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో ఈ సంఘటన జరిగింది. కట్టారి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన హెడ్మాస్టార్ ఒక హాస్టల్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక ఏడుస్తూ మిగతా బాలికలకు ఈ విషయం చెప్పింది. ఈ నేపథ్యంలో మిగతా విద్యార్థినులు ఆగ్రహించారు. కర్రలు చేతపట్టి ప్రధానోపాధ్యాయుడి రూమ్కు వెళ్లారు. విద్యార్థిని వేధించడంపై ఆయనను నిలదీశారు.
కాగా, కొందరు టీచర్లు, సిబ్బంది ఆ బాలికలను సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. ఇంతలో ఆ హెడ్మాస్టార్ ఒక క్లాస్రూమ్లోకి వెళ్లి తలుపులు మూసేందుకు ప్రయత్నించాడు. గమనించిన బాలికలు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడ్ని కర్రలతో చితక్కొట్టారు. ఆయనపై తమ ప్రతాపం చూపారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చారు. పలువురి బాలికలను ఆ హెడ్మాస్టర్ వేధించినట్లు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలికలు కర్రలతో హెడ్మాస్టార్ను చితక బాదిన వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
The victim immediately alerted other roommates and the students banded together and thrashed the headmaster.
The incident took place in #Katteri village of #Srirangapatna town in #Mandya district. The students belonged to the Katteri Government High School.#Karnataka pic.twitter.com/AXi4bvejGO
— Hate Detector 🔍 (@HateDetectors) December 15, 2022