బెంగళూరు: కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హుబ్బళ్లి-ధర్వాడ్లో ఉన్న ఈద్గా (Eidgah) మైదానంలో గణేశ్ చతుర్థి ఉత్సవాలకు అనుమతించింది. ఈమేరకు మంగళవారం అర్ధరాత్రి తీర్పును వెలువరించింది. నవరాత్రి వేడుకలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించింది.
హుబ్బళ్లీ ఈద్గా మైదానంలో గణేశుని వేడుకలు నిర్వహించడానికి నగర మున్సిపల్ కమిషనర్ అనుమతించారు. దీనికి వ్యతిరేకంగా అంజుమన్ ఈ ఇస్లామ్ సంస్థ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అశోక్ ఎస్ కినాగి.. ఈద్గా ఆస్తి ధార్వాడ్ మున్సిపాలిటీకి చెందిందని, అంజుమన్-ఏ-ఇస్లాం సంవత్సరానికి ఒక్క రూపాయి రుసుముతో 999 సంవత్సరాల కాలానికి లీజుదారుగా మాత్రమే ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ స్థలంలో వినాయకుని వేడుకలు అనుమతిస్తూ.. పిటిషన్ను తిరస్కరించారు. కాగా, బెంగళూరు ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
Karnataka | Ganpati idol installed at Eidgah ground at Hubbali-Dharwad after Karnataka High Court upheld authorities' decision to allow #GaneshChaturthi at Eidgah ground at Hubbali-Dharwad and rejected pleas challenging permission for allowing the rituals here. pic.twitter.com/ieafiRiIWg
— ANI (@ANI) August 31, 2022
కాగా, ఈద్గా మైదానంలో ఉత్సవాలకు హైకోర్టు అనుమంతించడంతో నిర్వాహకులు గణేశుడని ప్రతిష్టించారు. తెల్లవారుజామునే ఘనంగా తొలిరోజు పూజలు నిర్వహించారు. మరోవైపు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.
Karnataka High Court upheld authorities' decision to allow #GaneshChaturthi at Eidgah ground at Hubbali-Dharwad, rejects pleas challenging permission for allowing the rituals here.
Preparations underway for installing the Ganesh idol at the ground, visuals from this morning. pic.twitter.com/wpkaOWDzLQ
— ANI (@ANI) August 31, 2022