బెంగళూరు, ఫిబ్రవరి 21: సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలకు దిగిన ఇద్దరు సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారిణులను కర్ణాటక ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. అయితే వారిని ఎక్కడికి బదిలీ చేసింది మాత్రం పేర్కొనలేదు. గొడవ పడిన ఇద్దరు అధికారిణుల్లో ఒకరైన రూప భర్త, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల కమిషనర్ మునీష్ మౌడ్గిల్ను కూడా వ్యక్తిగత, పాలనా సంస్కరణల విభాగపు ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. అఖిల భారత సర్వీసుల నైతిక నియమావళి పాటించాలని ఇద్దరు అధికారిణులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మౌఖికంగా, లిఖిత పూర్వకంగా మార్గ నిర్దేశకాలు జారీ చేశారని, ఇందుకు వారిద్దరూ అంగీకరించారని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.