హుబ్బళ్లి: కులగణన చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పష్టంచేశారు. కర్ణాటకలో కులగణన వ్యవహారంపై ఆయన ఈ మేరకు స్పందించారు. కులగణన చేపడుతామని కర్ణాటక ప్రభుత్వం చెబుతున్నదని, అయితే రాష్ర్టానికి ఆ అధికారం లేదన్నారు.
కులగణన విషయంలో కర్ణాటక ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మరో నేత శివశంకరప్ప కులగణనను వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. కులగణన విషయంలో కర్ణాటక ప్రభుత్వం గందరగోళాన్ని సృష్టిస్తున్నదని పేర్కొన్నారు.