Tax on Temples | సిద్ధరామయ్య సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం దేవాలయాలపై పన్ను విధించేందుకు తీసుకువచ్చిన ఎండోమెంట్స్ బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ తిప్పి పంపారు. మరిన్ని వివరణలతో బిల్లును మరోసారి పంపాలని గవర్నర్ సర్కారును ఆదేశించారు. 2011-12 మధ్య కర్ణాటక హిందూ మతసంస్థలు, ధర్మాదాయశాఖ బిల్లుపై హైకోర్టు ధార్వాడ్ బెంచ్ స్టే విధించిందని రాజ్భవన్ పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. హైకోర్టు ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.
అప్పటి ఈ వ్యవహారం సుప్రీంలో పెండింగ్లో ఉందని రాజ్భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కేసు పెండింగ్లో ఉండగా.. సవరణ చట్టంలో సవరణలు చేయవచ్చా..? లేదా? అనే దానిపై స్పష్టత అవసరమని పేర్కొంటున్నాయి. అయితే, బిల్లు ప్రకారం.. రూ.కోటిపైగా ఆదాయం ఉన్న దేవాలయాలపై ప్రభుత్వం 10శాతం, రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం వచ్చే ఆలయాలు 5శాతం పన్ను చెల్లించేలా ప్రభుత్వం చట్టంలో సవరణ చేయగా.. అసెంబ్లీ ఆమోదం తెలిపి.. ఆమోదం కోసం గవర్నర్కు పంపింది.
తాజాగా గవర్నర్ బిల్లులను వెనక్కి పంపారు. ప్రస్తుతం కర్ణాటకలో 34వేలకుపైగా ఆలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వార్షిక ఆదాయం మేరకు ప్రభుత్వ ఈ ఆలయాలు మూడు కేటగిరిలుగా విభజించింది. అధికంగా ఆదాయం వచ్చే ఆలయాల నుంచి డబ్బులు తీసుకొని.. ఆదాయం లేని ఆలయాలు, పూజారుల సంక్షేమానికి ఖర్చు చేయాలని నిర్ణయించింది. అయితే, ప్రభుత్వంపై నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. బ బడ్జెట్లో అర్చకులకు ఎందుకు నిధులు కేటాయించలేకపోతుందని బీజేపీతో పాటు హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.