బెంగళూరు, అక్టోబర్ 5: కావేరి జలాల్ని తమిళనాడుకు విడుదల చేయాలన్న ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఎదుట కర్ణాటక పిటిషన్ దాఖలు చేసినట్టు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. తమిళనాడు మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న ‘మేకదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్’ ప్రాజెక్ట్ పనులు కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
‘కావేరీ బేసిన్లో 106 టీఎంసీల నీరుండాలి. అప్పుడే దిగువకు నీటిని విడుదల చేయగలం’ అని ఆయన తెలిపారు.