బెంగళూరు: విద్యుత్ సంక్షోభంపై కర్ణాటక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మొసలిని సబ్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ( Karnataka farmers protest with crocodile ) విద్యుత్ అధికారులతో పాటు ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఈ నెల 19న విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ కార్యాలయానికి మొసలిని తీసుకెళ్లారు. రొణిహాల గ్రామంలోని పొలాల్లో ఈ మొసలిని గుర్తించినట్లు రైతులు తెలిపారు. రాత్రి సమయంలో విద్యుత్ కార్యాలయంలో పాము, తేలు కాటు మొసలి బారిన పడి ఎవరైనా చనిపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారని విద్యుత్ అధికారులను ప్రశ్నించారు.
మరోవైపు కరెంట్ కోతల వల్ల తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. పగటిపూట నిరంతరాయంగా త్రీఫేజ్ కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అయితే మొసలితో రైతుల నిరసన విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు దానిని స్వాధీనం చేసుకుని కాలువలో విడిచిపెట్టారు. కాగా, రైతులు ట్రాక్టర్ ట్రాలీలో మొసలిని విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి నిరసన తెలిపిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In a protest against load shedding, farmers in #Karnataka‘s #Vijayapura district took a crocodile to the Hubli Electricity Supply Company Limited (HESCOM) office on October 19 (Thursday).
The farmers spotted the massive crocodile in a field at #Ronihala village after which they… pic.twitter.com/MjPeBV6NuB
— Hate Detector 🔍 (@HateDetectors) October 24, 2023