Karnataka | న్యూఢిల్లీ: కర్ణాటకలోని కోలార్-చిక్కబళ్లాపుర డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ (కేఓఎంయూఎల్)లో ఉద్యోగ నియామకాల్లో కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపించింది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజెగౌడ ఈ కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర పోషించారని తెలిపింది.
కొందరు రాజకీయ నేతలు సూచించిన 30 మంది అభ్యర్థులకు ఆయన నేతృత్వంలోని కమిటీ ఉద్యోగాలు ఇచ్చిందని వెల్లడించింది. లంచాలు తీసుకుని, ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తిగా మాయ చేసి, వీరికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పింది. ఒక్కొక్క ఉద్యోగానికి రూ.20-30 లక్షలు వసూలు చేసినట్టు వెల్లడించింది.