బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని పార్టీ హెడ్క్వార్టర్స్లో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇతర ముఖ్య నేతలు ఢిల్లీలో ఓటు వేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థిగా పోటీపడుతున్న మల్లిఖార్జున్ ఖర్గే బెంగళూరులోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఆయన ప్రత్యర్థి శశిథరూర్ కేరళలోని త్రివేండ్రంలో ఓటు వేయనున్నారు. ఇప్పటికే సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, పార్టీ సీనియర్ నేతలు పీ చిదంబరం, జైరామ్ రమేశ్, టీ సుబ్బిరామిరెడ్డి ఏఐసీసీ కార్యాలయంలోని పోలింగ్ బూత్లో ఓట్లు వేశారు.