బెంగళూర్ : కర్నాటకలో లాక్డౌన్ విధించబోమని కరోనా కట్టడికి కఠిన నియంత్రణలు మాత్రం కొనసాగుతాయని సీఎం బీఎస్ యడ్యూరప్ప బుధవారం పునరుద్ఘాటించారు. కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందని చెప్పారు. కాగా కొవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఈనెల 18న సీఎం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ భేటీలో మాజీ కర్నాటక సీఎంలు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్లతో పాటు మహమ్మారిపై ఏర్పాటైన సాంకేతిక కమిటీ సభ్యులు పాల్గొంటారని యడ్యూరప్ప వెల్లడించారు. కరోనా వైరస్ కట్టడికి సాంకేతిక సలహా కమిటీ లాక్డౌన్ విధింపుపై ఎలాంటి సూచనలూ చేయలేదని స్పష్టం చేశారు.