బెంగళూర్ : తాను ప్రాతినిధ్యం వహించే హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ నియోజకవర్గంలో ఇన్ఫోసిస్కు 58 ఎకరాల భూమి కేటాయించినా టెక్ దిగ్గజం ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే అరివింద్ బెల్లాద్ విమర్శించారు. ఇన్ఫోసిస్కు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బెల్లాద్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని పారిశ్రామిక ఎస్టేట్లో ఇన్ఫోసిస్కు 58 ఎకరాలు కేటాయించారని, అయితే ఆ కంపెనీకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఆ కంపెనీ నుంచి భూమిని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇన్ఫోసిస్ కోసం రూ కోటి విలువ చేసే భూమిని రైతుల నుంచి తాను కేవలం రూ. 35 లక్షలకే ఇప్పించానని, వారి పిల్లలకు ఉపాధి లభిస్తుందని రైతులకు తాను హామీ ఇచ్చానని గుర్తుచేశారు. ఇన్ఫోసిస్ కేవలం ఒక్క ఉద్యోగం కూడా ఎవరికీ ఇవ్వకపోవడంతో తానిప్పుడు రైతుల కండ్లలోకి చూసే ధైర్యం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
AI boy friends | ఏఐ బాయ్ఫ్రెండ్స్ పై చైనా అమ్మాయిల మోజు..!