కర్ణాటక బీజేపీ చీఫ్ అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా చీప్ క్వాలిటీ పనులపై కన్నేయాలని తన పార్టీ కార్యకర్తలకు సూచించాడు. ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రెయినేజీ సమస్యలు చాలా చిన్నవని, వాటిపై కాకుండా లవ్ జిహాద్పై దృష్టిసారించాలని బీజేపీ కర్ణాటక చీఫ్ నళిన్ కుమార్ కటీల్ పిలుపునివ్వడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంగళూరులో జరిగిన ‘బూత్ విజయ్ అభియాన్’ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు ఇలాంటి చీప్ సూచనలు చేయడంతో అక్కడి జనం నవ్వుకుంటున్నారు.
కార్యకర్తలు లవ్ జిహాద్పై దృష్టి పెట్టి ఎక్కడికక్కడ అణిచివేయాలని కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ కార్యకర్తలకు సూచించారు. రోడ్లు, కాలువలు, డ్రెయిన్లు, ఇతర చిన్నచిన్న సమస్యల గురించి మాట్లాడవద్దన్నారు. అలాగే, రాష్ట్రాభివృద్ధి, ఉపాధి, విద్య వంటివన్నీ చిన్న సమస్యలే అని చెప్పారు. వీటన్నింటి కంటే లవ్ జిహాద్పై కన్నేయడమే ముఖ్యమన్నారు.
కటీల్ ప్రసంగానికి సంబంధించిన వీడియోను కర్ణాటక కాంగ్రెస్ సోమవారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పీఎఫ్ఐపై నిషేధం రాకముందే రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయని నళిన్ కుమార్ కటీల్ చెప్పారు. హిందూ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పీఎఫ్ఐ వరుస హత్యలకు ప్లాన్ చేసిందని ఆరోపించారు. పీఎఫ్ఐని నిషేధించకపోయి ఉంటే ఇవాళ ఈ వేదికపై ఉన్న ఎందరో నేతలను కోల్పోవాల్సి వచ్చేదని చెప్పారు.