బెంగళూరు: కర్ణాటకలో రెసిడెంట్ డాక్టర్లు నిరసనకు దిగారు. రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ వద్ద గురువారం బైఠాయించి నిరసన చేపట్టారు. కోవిడ్ అలవెన్స్ చెల్లించాలని, పీజీ అకడమిక్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. తమకు నెల రోజుల కిందట ప్రభుత్వం వాగ్దానం చేసిన మేరకు కరోనా భత్య నిధిని విడుదల చేయాలని రెసిడెంట్ డాక్టర్లు కోరారు. అలాగే పీజీ ఫీజులను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు ఫ్లకార్డులను ప్రదర్శించడంతోపాటు నినాదాలు చేశారు.