న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Elections) తేదీని ఇవాళ సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల(Assembly Constituencies)కు ఎన్నికలను నిర్వహించనున్నారు. అన్ని స్థానాలకు ఒకే దశలో పోలింగ్ చేపట్టనున్నారు. ఏప్రిల్ 13వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 20వ తేదీ నామినేషన్లకు చివరి రోజు. ఏప్రిల్ 24వ తేదీ అభ్యర్థుల నామినేషన్ విత్డ్రాకు చివరి తేదీ అని ఇవాళ ఎన్నికల సంఘం ప్రకటించింది.
#WATCH | The day of polling for Karnataka Assembly elections will be 10th May, in the single phase and the results will be declared on 13th May. pic.twitter.com/v5lzt3HaBe
— ANI (@ANI) March 29, 2023
ఎన్నికల నియమావళి అమలులోకి రాకముందే భారీ మొత్తంలో కర్నాటకలో అక్రమ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్(CEC Rajiv Kumar) తెలిపారు. ఇటీవల సుమారు 80 కోట్ల విలువైన డబ్బు, వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. నగదుతో పాటు చీరలు, కుక్కర్లు, కిట్లు, హాట్ బాక్స్లు ఇతరు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టులను పటిష్టం చేసినట్లు చెప్పారు. ఎథికల్ ఓటింగ్ కోసం కమర్షియల్ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Schedule for GE to the Legislative Assembly of Karnataka.#AssemblyElections2023 #ECI #KarnatakaElections2023 pic.twitter.com/93lG2y9QZt
— Election Commission of India #SVEEP (@ECISVEEP) March 29, 2023
80 ఏళ్లు దాటిన ఓటర్లకు.. ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కర్నాటకలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 12 లక్షల మంది ఉన్నట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్ ఒకటో తేదీ, 2023 వరకు 18 ఏళ్లు నిండినవారికి ఓటు హక్కు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈసారి కొత్తగా 41 వేల మంది యువ ఓటర్లకు అవకాశం దక్కనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎలక్టోరల్ రోల్ ప్రకారం కర్నాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటరుగా రిజిస్టర్ చేసుకున్నారు. దీంట్లో 5.55 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు సీఈసీ తెలిపారు.
కర్నాటకలో తొలిసారి 9.17 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న గిరిజన తెగల ప్రజల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 224 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 58 వేల 282 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు సీఈసీ వెల్లడించారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు సగటున 883.50 ఓటర్లు ఉంటారన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. 1320 పోలింగ్ స్టేషన్లలను కేవలం మహిళా అధికారులే మేనేజ్ చేయనున్నారు.