బెంగళూరు, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని లింగాయత్, వీరశైవ విచార వేదిక పిలుపు నిచ్చింది. లింగాయత్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అణచివేతకు గురవుతున్నారని, ప్రముఖ లింగాయత్ నేతలకు టికెట్లు ఇవ్వకుండా వంచించారని వేదిక సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా, బీజేపీకి ఓటేయవద్దని ముస్లిం ప్రముఖులు ఓటర్లను కోరారు. సెక్యులర్ పార్టీ అభ్యర్థులకు ఓటేయాలని నాసిహ్ ఫౌండేషన్ అధ్యక్షులు మౌలాన సయ్యద్ షబ్బీర్ నల్వీ, జమాయత్ ఉలామా హింద్ అధ్యక్షుడు ముఫ్తీ ఇఫ్తికర్ అహ్మద్ ఖాస్మీ తదితరులు ఓటర్లకు సూచించారు.