న్యూఢిల్లీ : సైనికుల వీరోచిత పోరాటం, వారి ప్రాణ త్యాగంతో కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి విజయం లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అమరవీరుల పోరాటాన్ని, వారి త్యాగాలను దేశ ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు. 24వ కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకొని బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులకు నివాళి అర్పించారు. సైనికుల పోరాటాన్ని, ప్రాణా త్యాగాల్ని పార్లమెంట్ సభ్యులు గుర్తుచేసుకున్నారు. కార్గిల్ స్మారక కేంద్రం వద్ద సైనికుల త్యాగాలకు సెల్యూట్ చేశారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లోనూ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. 1999లో లడఖ్లో కీలక శిఖరాలను ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ సైన్యంతో భారత సైనికులు వీరోచితంగా పోరాడి, పాక్ సైన్యాన్ని వెనుకకు తరిమికొట్టారు. పాకిస్థాన్పై భారత్ విజయం సాధించిన నేపథ్యంలో ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు.