న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఆప్ఘనిస్ధాన్లో తాలిబన్ల రాజ్యం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. ఆప్ఘనిస్ధాన్ అంతర్గత సంప్రదింపుల్లో భారత్కు ఎలాంటి పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు.
తాలిబన్ల వ్యవహారాన్ని యూపీ ఎన్నికల ప్రయోజనాల కోసం కేంద్రం వాడుకుంటుందనడం చేదు నిజమని కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. కాగా ఆప్ఘన్ భూభాగాన్ని ఏ దేశంపైనైనా దాడి చేసేందుకు, ఉగ్రవాదుల శిక్షణకు, ఉగ్ర మూకలకు నిధులు సమకూర్చడం వంటి చర్యలకు వాడరాదని ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే.