Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగానే ఆయనను కొవిడ్-19 సూపర్ స్ప్రెడర్గా బీజేపీ నేత కపిల్ మిశ్రా అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్ కరోనాను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
పటియాలా, లక్నో, గోవాలో కొవిడ్-19 వ్యాప్తికి మీరు చేసిన పాపానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని కేజ్రీవాల్ను మిశ్రా ప్రశ్నించారు. మీరు కరోనా సూపర్ స్ప్రెడర్ అని కేజ్రీవాల్ను ఉద్దేశించి ఆప్ మాజీ నేత మిశ్రా ట్వీట్ చేశారు. కాగా అంతకుముందు తనకు నిర్వహించిన పరీక్షలో కొవిడ్-19 పాజిటివ్గా తేలిందని అంతకుముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న తాను హోం ఐసోలేషన్లో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. తనను ఇటీవల కలిసిన వారంతా కొవిడ్-19 టెస్టులు చేయించుకుని హోం ఐసోలేషన్లో గడపాలని కోరారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఇటీవల వరుస పర్యటనలతో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు.