High Court | లక్నో: హిందూ వివాహ చట్టం ప్రకారం హిందువుల పెండ్లికి కన్యాదానం ముఖ్యం కాదని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం చెప్పింది. ఈ చట్టంలోని సెక్షన్ 7 కేవలం సప్తపదిని మాత్రమే ముఖ్యమైన కార్యక్రమంగా గుర్తించినట్లు తెలిపింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అశుతోష్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను కోర్టు ఈ మేరకు తోసిపుచ్చింది.