న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఐఐటీ కాన్పూర్కు చెందిన ఇంక్యుబేట్ కంపెనీ ‘నోవాఎర్త్’.. కోడి ఈకలతో గిన్నెను తయారుచేసింది. పర్యావరణానికి అత్యంత ముప్పుగా మారిన ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’కు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది.
నోవాఎర్త్ తయారుచేసిన పర్యావరణ హితమైన కోడి ఈకల గిన్నెకు పేటెంట్ హక్కులు కూడా దక్కటం విశేషం. సంస్థ వ్యవస్థాపకుడు సార్థక్ గుప్తా మాట్లాడుతూ, ‘కోడి ఈకల నుంచి కెరాటిన్ అనే కంపోస్ట్ను తయారుచేశాం. ఈ పదార్థంతో గుండ్రటి గిన్నెను తయారుచేశాం. ఈ తరహా గిన్నెలతో పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు’ అని తెలిపారు.