న్యూఢిల్లీ: మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ సోమవారం నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం జూలై 5న చేసిన సిఫారసును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు.