మైసూర్: న్యాయమూర్తుల నియామకానికి ఏర్పాటుచేసిన కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించటం వెనుక దురుద్దేశం కనిపిస్తున్నదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే అభిప్రాయపడ్డారు. కొలీజియంలో రాజకీయ ప్రతినిధులు ఉంటే.. కొలీజియం నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు.
మైసూర్ డిస్ట్రిక్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొలీజియంలోకి బలవంతంగా జరుగుతున్న ఈ రాజకీయ చొరబాటు న్యాయవ్యవస్థను నియంత్రించే ప్రయత్నంగా పేర్కొన్నారు. ప్రస్తుత కొలీజియం కన్నా మెరుగైన వ్యవస్థ ఏమీ లేదన్నారు.