న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్కు మద్దతుగా ఆమె సోమవారం ట్వీట్ చేశారు. కేవలం అతని ఇంటిపేరు ఖాన్ అయినందుకే ఇలా వేధిస్తున్నారని ఆమె అనడం గమనార్హం. ఓ కేంద్ర మంత్రి కుమారుడు నలుగురు రైతులను హత్య చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అది వదిలేసి కేంద్ర ఏజెన్సీలు కేవలం ఖాన్ అనే ఇంటిపేరు ఉన్న కారణంగా ఓ 23 ఏళ్ల కుర్రాడి వెంట పడుతున్నారు. బీజేపీ ప్రధాన ఓటు బ్యాంక్ అయిన వాళ్ల శాడిస్టు కోరికలను నెరవేర్చడానికి ముస్లింలను కావాలని లక్ష్యంగా చేసుకొని న్యాయాన్ని పరిహసిస్తున్నారని మెహబూబా ఆ ట్వీట్లో విమర్శించారు.