న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ల రాజ్యం నడుస్తున్నది. ఇటీవలే ఎస్పీ ఎమ్మెల్యేకు చెందిన పెట్రోల్ బంకును యోగి ప్రభుత్వం బుల్డోజర్తో ధ్వంసం చేయగా, తాజాగా ఓ జిల్లా జడ్జికి చెందిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి బుల్డోజర్లను రంగంలోకి దించింది. వారసత్వంగా వస్తున్న స్థలా న్ని కాపాడుకోవడానికి ఆ జడ్జి ప్రాణాలకు తెగించి రాత్రంతా బుల్డోజర్కు అడ్డం పడుకోవాల్సి వచ్చింది. మనోజ్ కుమార్ శుక్లా సుల్తాన్పూర్ జిల్లా కోర్టులో అదనపు జడ్జి(ఏడీజే)గా పనిచేస్తున్నారు. హరియా-రాజవహా సరయూ కెనాల్ నిర్మాణం కోసం శుక్లా స్థలాన్ని లాక్కోవడానికి యోగి సర్కా రు ప్రయత్నిస్తున్నది. ఇటీవల ఓ రాత్రి బుల్డోజర్లను తీసుకొచ్చి పనులు చేయడానికి సంకల్పించింది. కాగా, బుల్డోజర్లను అడ్డగించారన్న కారణంతో అలహాబాద్ హైకోర్టు శుక్లాను సస్పెండ్ చేసింది.