Delhi High Court | ఢిల్లీ హైకోర్టు పరిధిలో 85 మంది న్యాయ అధికారులను బదిలీ చేస్తూ హైకోర్టు తాత్కాలి ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. హైయ్యర్ జుడీషియల్ సర్వీసెస్ కింద వివిధ జిల్లా కోర్టుల్లో, ప్రత్యేక కోర్టుల్లో పని న్యాయాధికారులుగా పని చేస్తున్న 27 మందిని బదిలీ చేయస్తూ హైకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు ఇచ్చారు.
వీరిలో కీలకమైన మద్యం కేసు విచారణ జరుపుతున్న రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ ప్రత్యేక న్యాయాధికారి ఎంకే నాగపాల్ బదిలీ అయ్యారు. ఎంకే నాగపాల్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు నుంచి తీస్ హజారీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయనతో పాఉట ఢిల్లీ జుడిషియల్ సర్వీసెస్లో పని చేస్తున్న 31 మంది న్యాయాధికారులను హైకోర్టు బదిలీ చేసింది. ఎంకే నాగపాల్ స్థానంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా కావేరీ భవేజాను నియమిస్తూ హైకోర్టు రిజిస్ట్రీ ఆదేశాలిచ్చారు.