న్యూఢిల్లీ: పెండింగ్ కేసులపై మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే అవసరం న్యాయమూర్తులకు లేదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పశ్బిమ బెంగాల్లో జరిగిన స్కూల్ ఉద్యోగాలకు లంచం కేసులో జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఒక న్యూస్ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినట్టు వార్తలు రాగా, అది నిజమేనా? కాదా? అన్నది తెలియజేస్తూ 4 రోజుల్లో తమకు నివేదిక ఇవ్వాలని కోల్కతా హైకోర్టుకు సుప్రీం ఆదేశం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను సుప్రీం ఆదేశించింది. ఒక కేసుకు సంబంధించి జస్టిస్ ఇంటర్వ్యూ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ ‘పెండింగ్ కేసులకు సంబంధించి ఇంటర్వ్యూలు ఇవ్వడం జడ్జిల పని కాదని మేము చెప్పాలనుకుంటున్నాం’ అంటూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా జస్టిప్ అభిజిత్ గంగోపాధ్యాయ టీవీ చానల్ ఏబీపీ ఆనందకు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన అనువాద కాపీని టీఎంసీ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ ధర్మాసనానికి అందజేశారు. దీనికి స్పందించిన ధర్మాసనం అసలు జడ్జి ఆ ఇంటర్వ్యూ ఇచ్చారో లేదో తెలియజేస్తూ గురువారంలోగా తమకు అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కోల్కతా హైకోర్టుకు సుప్రీం ఆదేశం హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది.