న్యూఢిల్లీ: రాజ్యసభకు ఎన్నికైన ఆరుగురు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణం చేసిన వారిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్రకు చెందిన అశోక్రావ్ చవాన్, రాజస్థాన్కు చెందిన చున్నీలాల్ గరాసియా, తెలంగాణకు చెందిన అనిల్కుమార్ యాదవ్, పశ్చిమ బెంగాల్కు చెందిన సుస్మితా దేవ్, అహ్మద్ నడిముల్ హక్ ఉన్నారు.