కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అజయ్ భట్లకు కూడా
న్యూఢిల్లీ, జనవరి 10: ప్రజల ఆరోగ్యాన్ని, కరోనా మార్గదర్శకాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పలుచోట్ల ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహించిన బీజేపీ నేతలు ఒకరి వెంట ఒకరు కరోనా కోరల్లో చిక్కుకొంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తాజాగా కరోనా వైరస్ సోకింది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అజయ్ భట్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కూడా వైరస్ బారినపడ్డారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, సీపీఎం నేతలు ప్రకాశ్ కారత్, బృందా కారత్లకూ కరోనా సోకింది.