భోపాల్: కొందరు వ్యక్తులు ఒక జర్నలిస్ట్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ దారుణం జరిగింది. బాధిత జర్నలిస్ట్ ఫిర్యాదుతో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రకాష్ యాదవ్ అనే జర్నలిస్ట్ ఒక టీవీ ఛానెల్లో పని చేస్తున్నాడు. ఈ నెల 25న పొరుగున ఉన్న మనగావ్ నుంచి బైక్పై సొంత గ్రామమైన కోట్గావ్కు తిరిగి వస్తున్నాడు.
మార్గమధ్యలో నారాయణ్ యాదవ్ అనే వ్యక్తి ఆ జర్నలిస్ట్ను అడ్డుకున్నాడు. జనవరి 1న జరిగిన వాదనపై ప్రకాష్ యాదవ్ను దుర్భాషలాడాడు. సోదరుడు నరేంద్ర యాదవ్, మరి కొందరు కలిసి అతడ్ని చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ చెంపపై కొట్టారు. అతడిపై పంచ్లు ఇచ్చారు. దీనిని తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు.
బాధిత జర్నలిస్ట్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ ప్రకాష్ యాదవ్పై దాడికి సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఆయనపై దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
WATCH: Journalist Tied To Tree, Slapped And Punched In Madhya Pradesh#MadhyaPradesh #Journalist #assault #Hoshangabad #arrested #viral #news #NewsUpdates #LatestNews #IndianJourno pic.twitter.com/ChY7lEdl9H
— Indian Journo (@indianjournoapp) January 28, 2023