లక్నో, ఫిబ్రవరి 2: కేరళకు చెందిన జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ 28 నెలల తర్వాత గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. యూపీలోని హత్రాస్ సామూహిక లైంగిక దాడి వార్త సేకరణకు వెళ్తుండగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. యూఏపీఏ, మనీ లాండరింగ్, విదేశీ నిధుల సేకరణ కేసులు మోపారు. గురువారం లక్నో జైలు నుంచి విడుదలైన కప్పన్ మీడియాతో మాట్లాడుతూ తన విషయంలో ‘న్యాయం ఆలస్యమైంది. అది కూడా అసంపూర్తిగా లభించింది’ అని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుగా ఉంటూ ప్రస్తుతం అమలవుతున్న యూఏపీఏ లాంటి దుర్మార్గ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.