శ్రీనగర్: కొంత కాలం క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకున్న సీనియర్ పొలిటీషియన్ గులాంనబీ ఆజాద్.. తాజాగా కాంగ్రెస్ అనుకూల వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినప్పటికీ లౌకికత్వం అనే కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. కేవలం పార్టీ సిస్టమ్ బలహీన పడుతున్నదన్న కారణంతోనే తాను బయటికి వచ్చానని ఆజాద్ తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన పార్టీ అని ఆజాద్ వ్యాఖ్యానించారు. వాళ్లు పంజాబ్ను సమర్థంగా పాలించలేరని పేర్కొన్నారు. సరైన ప్రణాళికతో వెళ్తే గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీని ఓడించే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నదని ఆయన చెప్పారు.