శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని నర్వాల్ ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నర్వాల్లో ట్రక్కుల హబ్గా పేరొందిన ట్రాన్స్పోర్ట్ నగర్లో ఉన్న ఓ యార్డ్లో భారీ శబ్ధంలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని జమ్ముజోన్ ఏడీజీపీ ముకేశ్ సింగ్ చెప్పారు. కాగా, శుక్రవారం కూడా జమ్మలో పేలుడు సంభవించింది.
సురాన్కోట్ మాజీ ఎమ్మెల్యే, గుజ్జర్ నాయకుడు చౌదురి మహమ్మద్ అక్రమ్ ఇంట్లో శుక్రవారం రాత్రి 7.30 గంటలకు భారీ పేలుడు చోటుచేసుకున్నది. అయితే ఈ ప్రమాదం నుంచి తన కుటుంబ సభ్యులు తృటిలో తప్పించుకున్నారని చెప్పారు. కాగా, ఘటనా స్థలంలో 12 కాట్రిజ్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.